*తెలుగువారు (ఆంధ్రాలో) ఎప్పటికినీ #ఆరంభసూరులు మాత్రమే…!!!*
*ఆ శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు….!!!* .
పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగ చరిత్ర చదువుతుంటే కళ్లలో నీళ్లు ఆగటం లేదు..
*ఆంధ్రాలో తెలుగు వాళ్ల చేవ చచ్చిన తనం పైన వికారం పుడుతోంది.*
ఆయన జీవితం స్కూల్లో పాఠాలుగా చదువుకున్నాం. కానీ అది సగం సగం నిజాలతో కూడిన ఫ్యాబ్రికేటెడ్ చరిత్రని అని ఈ పరిశోధనాత్మక కథనం చూశాక అర్థమైంది.
*ఒకటి మాత్రం నిజం.. పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి నాడే కాదు.. దశాబ్ధాల తరబడి…ఈనాటికీ అవమానం జరుగుతూనే వుంది.
* నాటి గుడివాడ నివాసి… అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గుడివాడ గడ్డ నుండే ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం నిరహారదీక్ష కు పూనిన సంకల్పానికి సాక్షిగా ప్రతి తెలుగు వాడూ తెలుసుకోవలసిన వాస్తవ విషయాలు… తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన 58 రోజులపాటు మద్రాసు నగరంలో నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే చనిపోయారు. ఆయన శవాన్ని మోసేందుకు కనీసం నలుగురు మనుషులు కూడా లేని నిస్సహాయ స్థితిలో అనాధగా అభాగ్యుడిగా ఆయన అసువులు బాసారు. నిజానికి పొట్టి శ్రీరాములుగారి గురించి ఆయన చేసిన త్యాగం గురించి చరిత్ర ఒక నల్లని దుప్పటి కప్పుకుంది. అమరజీవి పేరుతో ఈరోజుకు మాత్రం ఒకసారి ఆయనను తలుచుకుని అమర్ రహే అనుకుని మన పని మనం చేసుకుంటాం. ఆర్యవైశ్యులు ఆయన కులస్తులు కాబట్టి వాళ్ళే చూసుకుంటారని ఒక గుడ్డి కులం ముద్రను ఆయనకు వేసి మిన్నకుంటాం. ఎంత డొల్లతనం మన తెలుగువారిది. ఏది సీరియస్ గా తీసుకోవాలో ఏది వదిలిపెట్టాలో దిశ దశ లేక తెలుగుజాతి ఇలా నీరుగారిపోవటమే నేటికీ దేశ స్థాయిలో తెలుగువారంటే చేతగానితనం అనిపించుకుంటానికి కారణం. పక్కనే ఉన్న తమిళులు భాషా, సంస్కృతి , సంప్రదాయాలతో తమ జాతి ప్రత్యేకత కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంటే దానిని గొప్పగా చెప్పుకుంటాం గాని మనం మాత్రం మన జాతి పురుషుల గురించి కూడా సరిగ్గా తెలుసుకోము. ఇది ఎవరినో నిందించటానికి కాదు. మన తెలుగుజాతి కోసం నిండుప్రాణాలను తృణప్రాయంగా బలిచేసుకుని మనకు మాత్రం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పడ్డ కష్టం గురించీ వేదన గురించి నేటి తరం కనీసం కొంచెమైనా తెలుసుకోకుండా చేశారే అనే ఆవేదన. పొట్టిశ్రీరాములు గారిది నెల్లూరు జిల్లా. ఐటిఐ చదువుకుని మద్రాసులో రైల్వే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన పట్ల విధి చిన్నచూపు చూడటంతో ఒకే సంవత్సరంలో భార్యా బిడ్డా తల్లీ కూడా వరుసగా చనిపోవటంతో ఆయన ఖిన్నుడైపోయాడు. ఇక తన జీవితానికి అర్ధం లేదని కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో గాంధీజి మద్రాసు పర్యటన ఆయన ఆలోచనను మార్చివేసింది. ఎవరికీ కొరగాని ఈ జీవితం బాపూజి సబర్మతీ ఆశ్రమంలో ఆయన శిష్యరికంలో గడపడమే సబబని తోచి సబర్మతీ వెళ్ళిపోయారు. అక్కడ గుడివాడ నుంచి వచ్చిన యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం కలిసి ఇద్దరూ తెలుగువాళ్ళు కావటంతో స్నేహం కుదిరింది. .
గాంధీజీ కోపం విసుగు :- . విరాగులు, స్వాతంత్ర సమరయోధులతో సబర్మతి నిండిపోయింది. గాంధీజీకి రోజురోజుకూ తన చుట్టూ చేరుతున్న వారి పట్ల విసుగేసింది. “నా చుట్టూ చేరి రోజూ భజన చేయటం కంటే పల్లెసీమలకు వెళ్ళి ప్రజలను అహింసా పద్దతిలో స్వాతంత్రం కోసం పోరాడటానికి సిధ్దంగా తయారుచేయండి వెళ్ళండి” అని వాళ్లకు ఉద్భోద చేసారు. తన ఊర్లో తనకు ఎవరూ లేరని బాధపడుతున్న శ్రీరాములను యెర్నేని సుభ్రహ్మణ్యం తాను గుడివాడ దగ్గర స్థాపించిన గాంధీ ఆశ్రమంకు రమ్మని ఇద్దరం కలిసి పనిచేసుకుందామని ఆహ్వానించారు. వెంటనే గాంధీజీ కి చెప్పి గుడివాడ బయలుదేరారు. కొమరవోలు చెంత గల గాంధీ ఆశ్రమానికి గాంధీజీ 3 సార్లు వచ్చి వెళ్ళిన ఘనత ఉంది. పొట్టిశ్రీరాములు తన మకాం గాంధీ ఆశ్రమానికి మార్చారు. కానీ గుడివాడ కూడలి ప్రాంతం కావటంతో ప్రతి రోజూ నడుచుకుంటూ 7 కిలోమీటర్లు దూరంలోని గుడివాడకు వచ్చేవారు. ఆయనకు వైద్యం తెలుసు. తన ఆయుర్వేదమూలికల కోసం గాంధీ ఆశ్రమంలో రెండు ఎకరాలు ప్రత్యేకం ఔషధ మొక్కలు నాటుకుని ఉచితంగా వైద్యం చేసేవారు. మానేపల్లి మల్లిఖార్జున గుప్త, కూరాళ్ళ భుజంగ భూషణరావు, మెండా నాగయ్య, రావూరి అర్జనరావు, గోరా తదితరులతో నిత్యం గాెంధీజీ కార్యక్రమాల గురించి చర్చించేవారు. గోరా నాస్తిక సభలకు కూడా వెళ్లేవారు. హరిజన దేవాలయ ప్రవేశం అంగలూరులో నిర్విహించారు. విదేశీ వస్త్ర బహిశ్కరణ, స్వాతంత్రం వచ్చాక నెహ్రూ నిత్యావసర సరుకుల పై కంట్రోల్ పెట్టడాన్ని వ్యతిరేకించి గుడివాడ బజార్లలో బియ్యం రాసులుపోసి అమ్మి పోలీసుల నుంచి కూడా గౌరవ మర్యాదలు అందుకున్నారు. పదేళ్ళు గడిచిపోయాయి. మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి పదవీచ్యుతుడయ్యాడు. *తెలుగువారంటే ఆరంభసూరులు* మాత్రమేనని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా *తెలుగువారు ఆరంభసూరులు* అని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. ఎవరూ లేని తన జీవితం తెలుగువారి ఆత్మగౌరవానికి ఉపయోగపడనప్పుడు వేస్ట్ అని మిత్రుడు సాధు సుభ్రహ్మణ్యంతో కూర్చిని ఒప్పించి తాను చనిపోయైనా సరే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానని చెప్పారు. ఆయన ఆఖరి భోజనం వడ్డించిన 12 ఏళ్ల పోతరాజు రాధామనోహరి చెబుతూ ఆయన ఎప్పుడూ మజ్జిగన్నం బెల్లంతో తినేవారు. అదే వడ్డించాను. ఇదే నా ఆఖరి భోజనం అని చెప్పారు…..అంది. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో రైలు ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. భారతీయ భాషలకు భాషా ప్రయుక్త రాష్టాల పేరిట ఇస్తున్నారు కదా కాంగ్రెస్ అన్ని చోట్లా కూడా ఇస్తున్నదే కదా అని అడిగితే తెలుగు భాష కూడా ఒక భాషా? అన్నాడు. తెలుగు తమిళానికి చెందినదే ఆ భాష మాట్లాడే వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదు. అది అసలు ప్రత్యేకమైన భాష కాదు అన్నాడు. తెలుగు భాష యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరు కూడా అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు వాళ్ళల్లో వున్న కాంగ్రెస్ నాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా తమ కోసం తమ భాష కోసం ఒక రాష్ట్రం కోరి దీక్ష చేస్తుంటే ఇన్ని కోట్ల మంది తెలుగు వారిలో కూడా జాలీ దయ లేదు. కేవలం టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కానీ భజనపరులకే ప్రాధాన్యత నిచ్చే అధిష్టానానికి ఆయన వేదన పట్టలేదు. ఆయనకు కాంగ్రెస్ లో పార్టీలో బలం లేక, ఏమీ చెయ్యలేక కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. *పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక బలంతో నిండుకుండలా వుండే శ్రీరాములు గారు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది.
* ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం. ఎంతో నిర్లక్ష్యం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన *శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు.
* చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా కృష్ణాజిల్లాకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని చెపితే ఆయన ఆశ్చర్యపోయి ఎంతో ఆవేదన పడి వెంటనే అప్పటికప్పుడు కదలి శ్రీరాములు గారి శవాన్ని ఉంచిన స్థలం దగ్గరకు వచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని కాకులు పొడవకుండా తాటాకులతో కప్పి వచ్చిన సుబ్రహ్మణ్యాన్ని “శ్రీరాములు గారి శవం ఎక్కడా”? అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఈ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతులు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకు వెళ్ళటం సబబుకాదు అని
*తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు.* వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు.
*అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల గారు తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన అమరజీవి వయ్యా శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు.
*అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గార్కి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణ శవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో పచ్చి బూతులు తిడుతూ తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడకల్లారా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు….
* క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. అప్పటికి కానీ నెహ్రూ కదల్లేదు ఆ తరవాత ఆ మహానుభావుడు రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధా పోదని ఆంధ్రులకి *ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది.
* సాధు సుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. గుడివాడలో పొట్టిశ్రీరాములు స్మృతికి ఓ హైస్కూల్ వెలిసింది. అదే ఎస్పీ.ఎస్ హైస్కూల్. గుడివాడ నిండా ఆయన విగ్రహాలు అనేక పాఠశాలల్లో వాసవీ సంఘాలు వారు పెట్టారు. కానీ ఆయన నిజమైన త్యాగచరిత్రను నేటి తరానికి అందించటంలో పూర్తిగా కృతకృత్యులు కావటానికి అంకితభావం కలిగిన దేశభక్తి, తెలుగుజాతిపట్ల పరిపూర్ణ ఆరాధ్యత నిండిన దూతలు అవసరం. తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి అన్ని బాధలు పడి ప్రాణాలను బలిచేసుకున్న ఆయన్ని ఆనాడే కాదు ఈనాడూ కుల పిచ్చి ముదిరిపోయిన తెలుగు నాయకుల్లో పట్టించుకునే వాళ్ళు లేరు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు పెట్టడం కూడా చెయ్యరు. స్మృతి చిహ్నం నిర్మాణం చేసే ప్రభుత్వం కూడా లేదు. ఆయనకు భారత రత్న కావాలని అడిగేవారు లేరు. తరరాలు మారుతున్న సరే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడైనా సరే *ఆంధ్రాలో మన తెలుగు వాళ్ల చేవ చచ్చిన తనం పైన వికారం పుడుతోంది.
* *ఇదేగా మన ఆంధ్రోడి #ఆరంభ_సూరత్వం*🤣 🤫🤫🤫🤦♂️🤫🤫🤫 *బ్రాహ్మణ చైతన్య వేదిక* (వీరిది పోస్ట్ చేయటం జరిగింది.)
Recent Comments