Archive for March, 2022

హిందూ మహాసముద్రం మధ్యలో అయ్యవారు (శివుడు) లేని శైవక్షేత్రం


మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ఈ రోజు ఈనాడు పత్రికలో అమ్మవారు లేని శైవక్షేత్రం వార్త చదివాక ఈ మధ్య నేను చూసిన హిందూ మహాసముద్రం మధ్యలో, నాగద్వీపం లో ఉన్న అయ్యవారు (శివుడు) లేని శైవక్షేత్రం గురించి చెప్పాలనిపించింది. ఇక్కడ దొరికిన ప్రాచీనమైన బ్రాహ్మీ లిపి శాసనాలు నాగులు, యక్షులు ఈ ద్వీపాల్లో ఉండేవారని, బుద్ధుడు ఈ నాగద్వీపంకి స్వయంగా వచ్చి నాగుల్ని బౌద్ధం వైపు మరల్చినట్లు చెబుతారు. ఈ ద్వీపం బౌద్ధులకి పవిత్ర స్థలం. బుద్ధుడు స్వయంగా కాలిడిన ప్రాంతం. మన ఆంధ్రులకి(నాయక రాజులు) ఈ ద్వీపానికి కూడా దగ్గర సంబంధం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో విపులంగా రాస్తాను.